టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పలు సినిమాలో అక్కగా, తల్లిగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటించి మెప్పించిన సురేఖ వాణి.. గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన కూతురుతో కలిసి హాట్ ఫోటో షూట్లతో ఘాటు అందాలను షేర్ చేసుకుంటూ.. తన పర్సనల్ విషయాలను కూడా ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక తాజాగా సురేఖ వాణి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కూతురు సుప్రీతితో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్న ఈమె ఆదివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అంతకుముందు తలనీనాలు సమర్పించి మొక్కలు తీర్చుకుంది. అయితే ఎప్పటికప్పుడు ఘాటు ఫోటోషూట్లతో అందాన్ని ఆరబోసే ఈ ముద్దుగుమ్మ సడన్గా గుండుతో కనిపించడంతో చాలామంది షాక్ అవుతున్నారు. ఇక ఆమె ఫ్యాన్స్ కు ఇది హార్ట్ బ్రేకింగ్ ట్రీట్ అనే చెప్పాలి.
ఎంతో అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా గుండుతో కనిపించడంతో అంత షాక్ అవుతున్నారు. అయితే ఈ తల్లి కూతుర్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శ్రీవారి దర్శనానికి వెళ్లిన సురేఖావిణి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తి చూపారు. ఇక వీరి తిరుమల శ్రీవారి పర్యాటన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.