టాలీవుడ్ ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయసుధ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం ప్రేక్షకులకు, ఆతరం ప్రేక్షకులకు అందరికీ సుపరిచితమైన ఈనాటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటిస్తున్న జయసుధ సాహజనటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆతారం స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే భారీ పాపులారి దక్కించుకుందని చెప్పాలి.
ఇక జయసుధ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోయిన్గా సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోల సరసన నటించింది. అయితే ఒక సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ జయసుధను సినిమాల్లో మానేయాలని చెప్పారట. అలా చెప్పడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. అమె 19 ఏళ్ళ వయసులోనే భారీగా సినిమా అవకాశాలు దక్కించుకున్న జయసుధ.. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఇక చాలు సినిమాల్లో నటించడం ఆపేద్దాం అనుకుందట. కానీ అప్పటినుంచి ఆమెకు సినిమా అవకాశాలు మరింతగా పెరిగాయి.
ఆ తర్వాత జయసుధ పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత కూడా మరిన్ని అవకాశాలు రావడంతో నటనకు ఫుల్స్టాప్ పెట్టలేదు. ఆమె నటించే ప్రతి ఒక్క హీరో దగ్గర ఇక చాలు సినిమాలు చేయడం ఆపేస్తా అని చెబుతూ ఉండేదట. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఒకసారి ఆమెను నువ్వు సినిమాలన్నా చేయడం మానేసేయు.. లేదంటే ఇకపై నేను సినిమాలు ఆపేస్తా అని పదేపదే చెప్పడం అన్న మానేసే అమ్మ అంటూ సరదాగా అనేవారట. ఈ విషయం స్వయంగా జయ సుధ ఓ ఇంటర్వ్యూలో వివరించింది.