ఇటీవల రష్మిక మందన హీరోయిన్గా నటించి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మూవీ యానిమల్. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను రూపొందించబోతున్నట్లు సందీప్ రెడ్డివంగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ఈ సీక్వెల్లో నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయితున్నాయి. రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమా ద్వారా కోలీవుడ్కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తరువాత నటుడు శశి కుమార్ భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది.
ఇక ఇటీవల మాస్టర్ సినిమాలో విజయ్ జంటగా నటించి మెప్పించింది. ఇలా ఆమె నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం విక్రమ్ జంటగా తంగలాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవెల్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నటి మాళవిక మోహన్ ఇంతకుముందు కొన్ని హిందీ మలయాళ సినిమాల్లో మెప్పించారు. తాజాగా ఆమె బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ అందుకుందంటూ వార్త వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీలో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను కొల్లగొట్టి అదే క్రేజ్తో దూసుకుపోతుంది. ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించడానికి యూనిట్ సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో మాళవిక మోహన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే యానిమల్తో సక్సెస్ అందుకున్న రష్మిక మందన సీక్వెల్లో కనిపిస్తుందా.. లేదా.. అనేది వేచి చూడాలి.