ఆ డైరెక్టర్ కు ఉ** పడిపోయేలా చేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జన్మలో ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు..!

పాపం ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమా షూట్ ను స్టార్ట్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి త్రివిక్రమ్ పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా రీసెంట్ గా గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన పాటలు మొత్తం అభిమానులను డిసప్పాయింట్ చేశాయి . దీంతో చాలామంది జనాలు ఆ పాటలను ట్రోల్ చేయడమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ ను సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ ఏకిపారేశారు.

చెత్త చెత్త సినిమాలు మా అన్నతో తెరకెక్కిస్తారా..? అంటూ కొందరు ఇలాంటి చెత్త మ్యూజిక్ మా మహేష్ బాబు సినిమాకి అందిస్తారా ..? అంటూ ధమన్ ను ఏకీపారేశారు జనాలు . అయితే ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమా నుంచి నెక్స్ట్ పాటలను రిలీజ్ చేయడానికి భయపడిపోతున్నారట . ఈ సినిమాలో రష్మిక మందన్నా ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ సాంగ్ కి సంబంధించిన షూట్ ని కూడా చేయడానికి భయపడిపోతున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్ . అంతేకాదు ఏ పాట రిలీజ్ చేస్తే ఎక్కడ నుంచి ఏ రాద్ధాంతం వస్తుందో అంటూ గజగజ వణికిపోతున్నారట . ప్రజెంట్ ఇదే ట్రోలింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.