మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఓటీటీ రిలీజ్ పై దిమ్మతిరిగే అప్డేట్…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, పృద్వి రాజ్, జగపతి బాబు, రఘు బాబు, సునీల్, బ్రహ్మానందం, హైపర్ ఆది కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ గ్లింప్స్, రెండు సాంగ్స్, లేటెస్ట్ పోస్టర్ అందరిని ఆకట్టుకున్నాయి. జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ రైట్స్ మాద్యమం నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయం ఏమిటంటే.. గుంటూరు కారం మూవీ ఓటీటీ లో అందుబాటులోకి వచ్చేది థియేట్రికల్ రిలీజ్ అయిన 60 రోజుల అనంతరమే అని.. ఆ విధంగా నెట్ ఫిక్స్ వారు అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. మరి అందరిలో మంచి హైప్స్ ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ అందరిలో ఎంత మీరా విజయం అందుకుంటుందో చూద్దాం.