అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన మెగా హీరో.. అప్పుడు వరుణ్..ఇప్పుడు సాయి ధరమ్ తేజ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే మెగా డాటర్స్ నిహారిక, శ్రీజ విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా మెగా డాటర్ ట్రెండింగ్ లోకి వచ్చాక మెగా హీరోలను పట్టించుకోవడం మానేశారు జనాలు .

అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్త ట్రెండ్ అవుతుంది . ఓ హీరోయిన్ ని సాయి ధరమ్ తేజ్ ప్రేమించాడు అని.. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని .. అందుకే ఆయన హీరోయిన్ కి బ్రేకప్ చెప్పేసి లైఫ్ ని సింగిల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అని ..ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. మెహ్రిన్ .

మెహ్రిన్ – సాయిధరమ్ తేజ్ ప్రేమించుకున్నారు అని .. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని .. దీంతో ఇంట్లో వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేక సాయిధరమ్ తేజ్ హీరోయిన్ తో బ్రేకప్ చెప్పేసుకున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే గతంలో హీరో వరుణ్ తేజ్ కూడా ఇలాగే పూజా హెగ్డేను ప్రేమించాడు అని .. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేని కారణంగా ఆమెను దూరం పెడుతూ వచ్చాడని .. ఆమెతో బ్రేకప్ చెప్పేసుకున్నాడు అని కూడా వార్తలు వైరల్ అయ్యాయి .. ఇలా వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ కుటుంబం కోసం త్యాగం చేశారు అంటూ మెగా ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . ఇది అభిమానులకు ఊహించిన షాక్ గానే మిగిలిపోయింది..!!