పెళ్లికి ముందే వ‌రుణ్ తేజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. కాబోయే భార్య కోసం తండ్రిని బాధ‌పెడుతున్నాడా?

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు ఐదేళ్ల నుంచి సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఇటలీలోని టస్కానీ ప్యాలెస్ వేదికగా వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు.

ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. అయితే పెళ్లికి ముందే వ‌రుణ్ తేజ్ కాబోయే భార్య కోసం ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. పెళ్లి జ‌రిగిన త‌ర్వాత త‌న త‌ల్లిదండ్రుల‌తో ఉండ‌కుండా లావ‌ణ్యతో క‌లిసి స‌ప‌రేట్ హౌస్ కు షిప్ట్ అవ్వాల‌ని వ‌రుణ్ డిసైడ్ అయ్యాడ‌ట‌. ఇందులో భాగంగానే జూబ్లీహీల్స్ లో ఓ విలాస‌వంత‌మైన ఇంటిని కూడా కొనుగోలు చేశాడ‌ట‌.

నిజానికి వివాహం త‌ర్వాత వ‌రుణ్ తేజ్ వేరు కాపురం పెట్ట‌డం నాగ‌బాబుకి ఇష్టం లేద‌ట‌. అంద‌రం క‌లిసి ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుంద‌ని ఆయన అనుకున్నార‌ట‌. కానీ, లావ‌ణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి త‌ర్వాత ప్రైవ‌సీని కోరుకుంది. వ‌రుణ్ కూడా లావ‌ణ్య‌కే మ‌ద్ద‌తు ప‌లికాడు. దాంతో నాగాబాబు మ‌న‌సులో బాధ ఉన్నా కూడా వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి వేరు కాపురానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్ న‌డుస్తోంది.