బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 7 గత నెల ఆరంభంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీజన్ 7 ఉల్టా పుల్టా గా ఉండనుందని నాగార్జున ముందు నుంచి చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే సరికొత్త గేమ్ ప్లానింగ్ తో షోను ముందుకు నడుపుతున్నారు. 14 కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ఐదు వారాలను పూర్తి చేసుకుంది.
ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదుగురు ఎలిమినేట్ అవ్వగా.. అక్టోబర్ 8న ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంబటి అర్జున్, నటి అశ్విని, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి, పూజా మూర్తి, నయని పావని ఈ జాబితాలో ఉన్నారు. ఇకపోతే ఐదో వారం గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు అయ్యి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లాడు. మరోవైపు లాయర్ కమ్ యాక్టర్ శుభశ్రీ శాశ్వతంగా బిగ్ బాస్ హౌస్ కు గుడ్ బై చెప్పేసింది.
నామినేషన్స్ లో ఉన్న శుభశ్రీ.. ఐదో వారం ఎలిమినేట్ అయింది. అయితే ఐదు వారాల్లో ఆమె ఎంత సంపాదించింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా చెప్పాలంటే శుభశ్రీ.. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది. అంతకు ముందు ఈమె గురించి ఎవరికీ పెద్దగా తిలియదు. అయినప్పటికీ ఈ అందాల భామకు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి రూ. 2 లక్షలు చొప్పున ఇచ్చారట. అంటే ఐదు వారాలకు గానూ సుబ్బు రూ. 10 లక్షలు పట్టికెళ్లిందని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది.