దసరా ముందు దుమ్ము లేపుద్దాం.. బాలయ్య కామెంట్స్‌..!!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ” భగవంత్ కేసరి “. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో బాలయ్య మాట్లాడుతూ..” పొరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్ ప్రజలు.. నా అభిమానులందరికీ శుభాభినందనలు. నాకు వరంగల్ తో అనుబంధం ఉంది. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ భద్రకాళి అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించారనుకుంటున్నా.

సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ లాంటి ఎందరో పోరాట యోధులను స్మరించుకుంటున్నా. పెండ్యాల రాఘవయ్య వరంగల్ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్యేగా, వర్ధన పేట ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1984లో నాన్న గుడివాడ, హిందూపూర్, నల్గొండ నుంచి పోటీ చేసి, మూడు చోట్ల విజయం సాధించారు. నేను ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో సంభాషణలు చెప్పా. ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనం ఉన్న సినిమాలు అందించాలనేదే నా తాపత్రయం.

దసరా ముందు దంచుదాం. కొత్త సినిమా చేసేందుకు నేను నా పాత సినిమాల‌ గురించి దర్శకులతో చర్చించాను. ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తా. చరిత్రలో నిలిచిపోయే సినిమాలు నేను చేయగలిగాను అంటే దానికి కారణం ఆయా సినీ బృందాల సమష్టి కృషి ” అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.