కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ పూజా మూర్తి ఎమోషనల్ కామెంట్స్..!

ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 7 వసీజన్ ప్రసారం అవుతుండగా తాజాగా నిన్న రాత్రి బిగ్ బాస్ 2.0 ఈవెంట్ ను చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈసారి ఏకంగా ఐదు మంది హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇకపోతే ఉల్టా పుల్టా అంటూ ఊహించని ట్విస్టులు ఇస్తున్న నాగార్జున శుభశ్రీ , గౌతమ్ కృష్ణలకు షాక్ ఇస్తూ డబుల్ ఎలిమినేషన్ పేరుతో గౌతమ్ కృష్ణకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి సీక్రెట్ రూమ్ కి పంపించాడు. ఇకపోతే అనంతరం నటి అశ్విని , భోలే షావలి , అంబటి అర్జున్ లను హౌస్ లోకి పంపించిన తర్వాత నటి పూజా మూర్తిని నాగార్జున పరిచయం చేశారు.

ఆమె ఇంట్రో వీడియోని ప్లే చేయగా చూడడానికి బొద్దుగా ఉండే పూజా ని చాలామంది అవమానకరంగా మాట్లాడారని.. అయితే ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళ్లాను అని తెలిపారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన పూజా మూర్తి ఎమోషనల్ అవుతూ అందరి చేత కంటతడి పెట్టించారు. ఇది మా నాన్న కోరిక నెక్స్ట్ నేను బిగ్ బాస్ షో కి వెళ్తాను అనగా నాన్న మరణ వార్త తెలిసింది. ఇక కొద్దిసేపటి క్రితమే నాన్న నాతో మాట్లాడారు.. బాగా ఆడు.. డోంట్ వర్రీ నేను చూస్తూ ఉంటాను అని ధైర్యం చెప్పారు.. నాన్న దూరమైన బాధ నుండి ఇంకా కోలుకోలేకపోతున్నాను అంటూ తెలిపింది.

ఇక పూజ మాట్లాడిన ఈ ఎమోషనల్ వర్డ్స్ అందరి మనసులను కదిలించాయి. ఇక తర్వాత నాగార్జున ఆమెకు సర్ప్రైజ్ ఇస్తూ పుదీనా చికెన్ తెప్పించారు .మా నాన్నగారు వంట చాలా బాగా చేస్తారు . ఆయన చేసే పుదీనా చికెన్, రసం అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆమె తెలిపింది. మొత్తానికైతే తన తండ్రి లేడన్న బాధను దిగమింగుకొని హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న పూజా మూర్తి ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.