అన‌సూయ భ‌ర్త గురించి విస్తుపోయే నిజాలు.. ఇంత‌కీ రంగ‌మ్మ‌త్త హ‌స్బెండ్ ఏం ప‌ని చేస్తాడో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్‌ ఒకటి. యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ.. ప్రస్తుతం వెండితెర‌పై వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రంగస్థలం మూవీలో అనసూయ పోషించిన రంగ‌మ్మత్త పాత్ర అద్భుతంగా క్లిక్ అయింది. అప్ప‌టి నుంచి అన‌సూయ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

ప్రాధాన్యత ఉన్న పాత్రల‌ను పోషిస్తూ ప్రేక్షకుల‌ను అలరిస్తోంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. అనసూయకు పెళ్ళై ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అన‌సూయ క‌లేజీలో చ‌దువుకుంటున్న స‌మ‌యంలోనే సుశాంక్ భ‌రద్వాజ్ తో ప్రేమ‌లో ప‌డింది. చాలా ఏళ్లు ల‌వ్ లో ఉన్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రూ ఇద్ద‌రు కుమారులు జ‌న్మించారు. పెళ్లై పిల్ల‌లు పుట్టినా కూడా అన‌సూయ ప‌ర్ఫెక్ట్ ఫిగ‌ర్ ను మెయింటైన్ చేస్తూ యాంక‌ర్‌గా, న‌టిగా స‌త్తా చాటుతోంది.

ఇక ఆమె భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్ గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. అత‌ని గురించి కొన్ని విస్తుపోయే నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. నార్త్ ఇండియాకు చెందిన సుశాంక్‌.. ఫైనాన్స‌ర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన‌ర్ గా జాబ్ చేస్తున్నాడు. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదిస్తుంటాడు. అలాగే సుశాంక్ ఒక బైక్ ట్రావెలర్, రైడర్ కూడా. రాయల్ ఎన్ ఫీల్డ్, బీఎమ్‌డ‌బ్లూ, హార్లీ డేవిడ్ సన్ లతో పాటు పలు రకాల బైక్స్ ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్నాయి. ఆ బైక్స్ మీద దేశంలోని కొత్త కొత్త ప్రదేశాలకు స్నేహితుల‌తో కలిసి సుశాంత్ త‌ర‌చూ ట్రావెల్ చేస్తుంటాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా సైతం పంచుకుంటాడు.

 

View this post on Instagram

 

A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj)