ఆ హీరోయిన్ ని నమ్మించి దారుణంగా మోసం చేసిన చరణ్..ప్రూఫ్ తో ఇరిక్కించేసిన స్టార్ డాటర్..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రజెంట్ గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . అంతేకాదు ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమాలోను నటిస్తున్నాడు . ఆ తర్వాత లోకేష్ కనగరాజు.. ఆ తర్వాత సుకుమార్ ఇలా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ బడా డైరెక్టర్ లకి ఫిక్స్ అయిన రాంచరణ్ పై ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఆమె మరెవరో కాదు కీయరా అద్వాని .

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసిన కీయరా అద్వానీ – చరణ్.. వినయ విధేయ రామ అనే సినిమాలో నటించారు . అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సభకు నమస్కారం అంటూ తెలుగులో స్పష్టంగా మాట్లాడింది . అయితే అది చాలా ఫన్నీగా అనిపించింది . ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న షోలో కీయరా అద్వాని చరణ్ నిజస్వరూపం బయటపెట్టింది .

నిజానికి అలా తనను మాట్లాడమనింది చరణ్ నే అంటూ ఓపెన్ అప్ అయింది . అంతేకాదు చరణ్ కూడా “యస్” నేను అలా అనమన్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు . అయితే ఇదే విషయంలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..” నువ్వెందుకు అలా చెప్పమన్నావు..?” అంటూ తిరిగి చరణ్ ని క్వశ్చన్ చేస్తాడు . అయితే అప్పుడు కీయరా అద్వానీ కోపడుతూ..బద్మాష్ అంటూ చరణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతుంది . అయితే ఇదంతా సరదాగా జరిగిన సంభాషణ అయినా కీయరా అద్వానీ మాత్రం తన మనసులోని ఫీలింగ్ ని బయటపెట్టింది అంటూ ఫ్యాన్స్ అప్పుడు ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేశారు. మళ్లీ గేమ్ చేంజర్ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అని తెలిసి అదే న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు..!!