ఎన్టీఆర్ ని చంపేయడానికి క్షుద్ర పూజలు చేశారంటూ లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు నందమూరి తారక రామారావు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలా అతి తక్కువ సమయంలోనే టిడిపి పార్టీని స్థాపించి సీఎంగా పేరు సంపాదించారు సీనియర్ ఎన్టీఆర్.. అయితే సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడానికి ముఖ్య కారణం క్షుద్ర పూజలు అంటూ పెను సంచలనాలకు దారితీస్తోంది ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి.

Lakshmi Parvathi's elevation reflects relevance of NTR's legacy

గత కొద్దిరోజుల క్రితం చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు చేయడం జరిగింది. దీంతో కొంతమంది టిడిపి నాయకులు వైసిపి ప్రభుత్వం పైన పలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ పలువురు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలకడంతో వారు పైన విరుచుకుపడింది లక్ష్మీపార్వతి.. అంతేకాకుండా ఎన్టీఆర్ చనిపోవాలని ఆయన కుమార్తె భువనేశ్వరి అప్పట్లో క్షుద్ర పూజలు కూడా చేశారంటూ పలు సంచలన ఆరోపణలు తెరలేపింది లక్ష్మీపార్వతి. ఈ విషయం ఎన్టీఆర్ కి తెలిసి చాలా బాధపడ్డారని కూడా తెలియజేసింది.

ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు కానీ తనని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నప్పుడు చూడడానికి కూడా ఎవరూ రాలేదు.. కొడుకు లోకేష్ సీఎం కావాలంటు దేవాలయాలలో భువనేశ్వరి రుద్ర పూజలు చేశారంటూ మండిపడుతోంది. ఓ అవినీతిపరుడి భార్య మరో అవినీతిపరుడు తల్లి అనే పేరు భువనేశ్వరి తెచ్చుకుందంటూ ఎద్దేవా చేస్తోంది. ఎన్టీఆర్ మహానుభావుడు కారణజన్ముడని.. కానీ ఆయనకు జన్మించిన వారు మాత్రం పనికిమాలిన వారుగా మారారని ఘాటుగా వాక్యానించింది లక్ష్మీపార్వతి.. ఆయన ఏ జన్మ శాపం చేసుకున్నారు తెలియదు కానీ ఇలాంటి సంతానం కలిగి ఉందని తెలిపింది. మానసికంగా క్షోబా పెట్టి చివరికి ఆయన చావుకి కారణమయ్యారని తెలిపింది.