ప్రతి వారం థియేటర్స్ లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచి విజయం సాధిస్తే.. మరికొన్ని అపజయాల పాలవుతుంటాయి. సినిమాలు అన్నాక హిట్లు ఫ్లాపులు చాలా కామన్. అయితే ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే నిర్మాతలు చాలా నష్టపోతారు. భారం మొత్తం వాళ్ళ పైనే పడుతుంది. అలాంటి సమయంలో నిర్మాతలను ఆదుకునేందుకు తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చే నటీనటులు చాలా అరుదుగా ఉంటారు.
ఎవరో కొంతమంది మాత్రమే కోటి లేదా రెండు కోట్లు వెనక్కి ఇస్తుంటారు. కానీ తాజాగా ఓ స్టార్ హీరో సినిమా డిజాస్టర్ కావడంతో ఏకంగా రూ. 35 కోట్లు వెనక్కి ఇచ్చాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. రీసెంట్ గా ఈ హీరో `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తే.. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రను పోషించాడు.
ఫర్హాద్ సామ్జీ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. రూ. 200 కోట్ల టార్గెట్ లో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఫుల్ రన్ లో రూ. 110 కోట్ల నెట్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుని భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో సినిమాను కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమని ఆదుకోమని వేడుకోగా.. లెక్కలన్నీ చూసి తాజాగా సల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 35 కోట్లు వెనక్కి ఇచ్చాడట. దాంతో సల్మాన్ మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. నిజంగా నువ్వు గ్రేట్ సామి అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.