“అలా చేస్తే మంచే జరుగుతుంది”.. సమంత నీతి వ్యాఖ్యలు దానికోసమేనా..?

సినిమాలు సక్సెస్ కాలేకపోయినప్పుడు ..హీరోయిన్స్ నీతి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అని ..చాలా మంది చెబుతూ ఉంటారు .. బహుశా సమంత ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది . రీసెంట్గా నటించిన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది . కానీ సమంత నటనకు ఆమె యాక్టింగ్ కు పెద్దగా మార్కులు పడలేదు . అంతేకాదు ఇది మొత్తం మ్యూజికల్ హిట్టయిందే తప్పిస్తే విజయ్ దేవరకొండకు సమంతకు అసలు హిట్ క్రెడిట్ దక్కలేదు .

ఇలాంటి క్రమంలోనే సమంత రీసెంట్గా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల ఆమె వెనిస్ నుంచి తన కొత్త ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. వెనిస్ నడిమధ్య ఉన్న గెలాతో స్వర్గ ధామం అయినా గెలాతో టెకాసుసో లియన్ అడ్వెంచర్ ఫొటోస్ షేర్ చేసింది . అంతేకాదు ఓ ఆసక్తికర పోస్టు కూడా పెట్టింది . “వేచి చూసే వారికి ఎప్పుడు మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి” అనే క్యాప్షన్ ఇచ్చింది.

అయితే సమంత సడన్గా ఇంత నీతి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఆమె లైఫ్ లో జరుగుతున్న సిచువేషన్ అంటూ తెలుస్తుంది . సమంత లైఫ్ లో వరుసగా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి . కానీ ఆమె ఎంతో ఓపికగా వెయిట్ చేస్తుంది . ఇలా ఓపికగా వెయిట్ చేయడం వల్ల త్వరలోనే మంచి రోజులు వస్తాయి అంటూ అని చెప్పుకొస్తుంది . మరి సమంత లైఫ్ లో రాబోయే ఆ మంచి రోజులు గురించి తెలుసుకోవాలి అంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే..!!