మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ” త్రీ ” సినిమాతో 19 ఏళ్లకే సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే కంపోజర్ గా మంచి పేరు సంపాదించుకున్న అనిరుధ్ తర్వాత స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే లిస్టులోకి చేరిపోయాడు. ఇక అనిరుద్ కంపోజ్ చేసిన త్రి సినిమా ఆల్బమ్ విషయంలో జరిగిన ఓ తప్పు వల్ల అతను ఎంతో నిరాశకు గురయ్యాడట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. త్రి సినిమా పాటలను సీడి రూపంలో రిలీజ్ చేయాలని టీమ్ మొదట భావించిందట.
కాని కొన్ని అనివార్య కారణాలవల్ల వైదిస్ కొలవెరిడి పాట ఆన్లైన్లో లీక్ అయ్యింది. సిడిలు చేసి రిలీజ్ చేసే టైం లేక యూట్యూబ్లోనే విడుదల చేసేద్దామని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు మూవీ టీమ్. సంగీత దర్శకుడుగా నా ఫస్ట్ మూవీలోని మొదటి పాట సిడి రూపంలో వస్తే చూడాలని దాన్నీ స్నేహితులకు అందించాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నానడట అనిరుధ్. కానీ అలా జరగకపోవడంతో ఎంతో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.
ధనుష్ – శృతిహాసన్ నటించిన లవ్ స్టోరీ త్రీ. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2012లో రిలీజ్ ఐ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా వైదిస్ కొలవెరిడి పాట ఆ రోజుల్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వేదికలోను, టీవీలోనూ ఈ పాట ఒకప్పుడు మారుమోగిపోయేది. సిడీల రూపంలో కాకుండా ఆన్లైన్లో విడుదలైన సరే ఈ పాట సంచలనం సృష్టించింది.. అంటే అప్పట్లోనే అనురుధ్ ఎటువంటి మ్యూజిక్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.