నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అర డజన్ కు పైగా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణబీకర్ కపూర్ తో `యానిమల్` సినిమాలు చేస్తోంది. అలాగే ఇటీవల ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయింది.
`రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలోనూ రష్మికనే హీరోయిన్ అని అంటున్నారు. మొత్తానికి చేతి నిండా చిత్రాలతో హవా చూపిస్తున్న రష్మిక.. రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లింది.
అక్కడ చీరకట్టులో దిగిన కొన్ని ఫోటోలను రష్మిక ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మిర్రర్ వర్క్, గోల్డ్ డిటైలింగ్తో కూడిన పీచు రంగు చీరలో రష్మిక కేక పెట్టించింది. అయితే ఇప్పుడు రష్మిక శారీ ఖరీదు హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ క్రాష్ శారీనే కాదు కాస్ట్ కూడా గ్రాండ్ గానే ఉంది. ఈ చీరను అర్పితా మెహతా డిజైన్ చేశారు. ఈ చీర ధర అక్షరాల రూ. 2.6 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఒక్క చీర కోసం రష్మిక రెండున్నర లక్షలు ఖర్చు పెట్టిందా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.