బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ `విరూపాక్ష`. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, సాయి చంద్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ హర్రర్ థ్రిల్లర్ ఏప్రిల్ లో విడుదలై మంచి విజయం సాధించింది.
సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా విరూపాక్ష 2 ఉంటుందని డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు విరూపాక్ష 2కు రంగం సిద్ధమైంది. కథ మరియు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన కార్తీక్.. సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే విరూపాక్ష 2లో హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం కాదు. ప్రస్తుతం తేజ్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. హెల్త్ కారణంగా కొద్ది నెలలు సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. దీంతో డైరెక్టర్ కార్తీక్ విరూపాక్ష 2ను తేజ్ కు బదులుగా అఖిల్ అక్కినేనితో చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే అఖిల్ కు స్టోరీ నెరేట్ చేయగా.. అది ఆయనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పాడట. ఏజెంట్ ఫ్లాప్ తో కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిన అఖిల్.. స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి ప్రాజెక్ట్ ను `ధీర` అనే టైటిల్ తో ఓ కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు ధీర కంటే ముందే అఖిల్ విరూపాక్ష 2 చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.