వార్నీ దుంప తెగ.. వరుసనే మార్చేసారు కదరా సామీ..ఎన్టీఆర్ కి జాన్వీ ఏం అవుతుందో తెలుసా..?

ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా దేవర. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతుంది . ఈ సినిమాలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ బావ మరదలుగా కనిపించబోతున్నారట . ఈ సినిమా కూడా కేజిఎఫ్ , బాహుబలిలా 2 భాగాలుగా తెరకెక్కిబోతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

నిజానికి ఎన్టీఆర్ శ్రీదేవి కాంబో ఎంత సక్సెస్ అయిందో మనకు బాగా తెలుసు. ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీదేవి బాలకృష్ణ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు . దానికి కారణం ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించానని .. పరోక్షకంగా నేను మీకు అమ్మ స్థానంలో నిలిచి ఉన్నానని .. మరి మీలాంటి హీరోతో ఎలా రొమాన్స్ చేస్తాను అంటూ ఆయనతో వచ్చిన ఆఫర్లన్నీ రిజెక్ట్ చేసిందట .

ఒక విధంగా చూసుకుంటే బాలకృష్ణకు ఎన్టీఆర్ కి మధ్య ఉన్న సంబంధం పరంగా శ్రీదేవి ఎన్టీఆర్ కి నాయనమ్మ అవుతుంది, నాయనమ్మ కూతురు అంటే మేనత్త అవుతుంది. మరి జాన్వి కపూర్ తో ఎన్టీఆర్ ఎలా రొమాన్స్ చేస్తాడు అనేది ఇప్పుడు అభిమానుల బిగ్ క్వశ్చన్ అంతే కాదు.. కొరటాల ఇంత దారుణంగా వరుసలు మార్చేశాడు ఏంటి..? అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!