టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్పై కనిపిస్తే అభిమానులు పండగ చేసేసుకుంటారు. పైగా మల్టీస్టారర్ సినిమాలకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. అందుకే స్టార్ హీరోలైన సరే ఎటువంటి ఈగోలకు పోకుండా మల్టీస్టారర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అలా తెలుగులో వచ్చిన మల్టీస్టారరే `దేవదాస్`. టాలీవుడ్ కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోలుగా నటించారు.
శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2018లో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమా కంటే ముందే నాగార్జున, నాని కాంబోలో ఓ మల్టీస్టారర్ మూవీ రావాల్సి ఉంది. ఆ మూవీ మరేదో కాదు `ఊపిరి`. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, కోలీవుడ్ హీరో కార్తి కలిసి నటించారు. తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తే.. జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.
అనుష్క శెట్టి, శ్రియా గెస్ట్ రోల్స్ ను ప్లే చేశారు. 2016లో రిలీజ్ అయిన ఊపిరి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో కార్తి పాత్రకు ఫస్ట్ ఛాయిస్ నానీనే. వంశీ పైడిపల్లి నాగార్జున, నాని కాంబోలో ఊపిరి సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ, అప్పటికే నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్మన్ సినిమాలకు కమిటై ఉన్నారు. దాంతో డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల నాని సున్నితంగా ఊపిరిని రిజెక్ట్ చేయగా.. ఆ అవకాశం కార్తికి దక్కింది. అలా నాని, నాగార్జున కలయికలో ఓ సూపర్ హిట్ మూవీ మిస్ అయిపోయింది.