త్రివిక్రమ్-సునీల్.. ఈ ప్రాణ స్నేహితుల లైఫ్ లో సేమ్ టూ సేమ్ జరిగిన సంగతేంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి ఒకేసారి అడుగుపెట్టారు. ఒకే రూమ్ లో ఉంటూ యాక్టర్ గా సునీల్, రైటర్ గా త్రివిక్రమ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మూడు పూటలా తినడానికి కూడా ఇబ్బందిగా ఉండే రోజులను ఎదుర్కొన్నారు. ఫైనల్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

త్రివిక్రమ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. మరోవైపు సునీల్ కామెడియన్ గా, హీరోగా ఇప్పుడు విలన్ గా దూసుకుపోతున్నాడు. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సునీల్, త్రివిక్రమ్ లైఫ్ లో సేమ్ టూ సేమ్ ఒక విషయం జరిగింది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ విషయం ఏంటంటే త్రివిక్రమ్, సునీల్ ఒకే ఏడాది ఒకే రోజు ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకున్నారు. బహుశా ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

2002 అక్టోబ‌ర్ 11న శిల్పారామం లోని సైబర్ గార్డెన్స్ లో శృతి అనే అమ్మాయితో సునీల్ వివాహం ఘనంగా జరగగా.. అదే రోజు శ్రీనగర్ కాలనీ లోని శ్రీ సత్య నిగమం లో ప్రముఖ గేయ రచయితా సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారి సోదరుడి కుమార్తె సాయి సౌజన్య తో త్రివిక్రమ్ పెళ్లి అయ్యింది. యాదృచ్ఛికంగా ఈ ప్రాణ స్నేహితులిద్దరూ ఒకేరోజు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు సంతానం కాగా.. సునీల్ కు కూడా ఇద్దరూ పిల్లలు ఉన్నారు.