తెలుగు దర్శకులంతా నా ప్రైవేట్ పార్ట్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు.. ఇలియానా..

టాలీవుడ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్లు వేరొక ఇండస్ట్రీకి వెళ్లిన తరువాత తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తూ దర్శకులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా చేసిన చాలామంది హీరోయిన్లు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. వారిలో రష్మిక మందన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను వంటి వాళ్లు కూడా ఉన్నారు. అయితే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా ఇదే వివాదంలో చిక్కుకుంది.

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కాగా ఇటీవల అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా టాలీవుడ్ డైరెక్టర్స్ పై సంచలన కామెంట్స్ చేసింది. ‘ టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మీరు.. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర లేదు ఎందుకు? అని ప్రశ్నించగా దీనికి సమాధానం చెపింది ఇలియానా.

ఆమె మాట్లాడుతూ ‘ తెలుగు డైరెక్టర్లు అందరూ నా పాత్ర గురించి కాకుండా నా నడుముని ఎలాంటి యాంగిల్స్ లో చూపించాలి. ఎన్ని షేడ్స్ లో నడుము కనిపిస్తే బాగుంటుందని దానిపైనే ఫోకస్ చేశారు. కానీ నా పాత్ర గురించి ఆలోచించలేదు. నా నడుము పైన ఉన్న దృష్టి నాకు ఇచ్చే క్యారెక్టర్ మీద లేదు ‘ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇలియానా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.