గాండీవధారి అర్జున.. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బి.వి.ఎస్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
ఆగస్టు 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని వరుణ్ తేజ్ ఆశపడుతున్నారు. ఇదే తరుణంలో ఈ మూవీ బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 55 కోట్లు బడ్జెట్ పెట్టారట.
గాండీవధారి అర్జున మేజర్ షూటింగ్ ఫారెన్ లోనే జరిగింది. దీంతో బడ్జెట్ ఊహించిన దానికంటే ఎక్కువ అయిందట. వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే అని చెప్పుకోవాలి. అయితే నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో మేకర్స్ ఇప్పటికే బడ్జెట్ లో రూ 26 కోట్లు రికవరీ చేసేశాడు. ఇక థియేట్రికల్ బిజినెస్ రూ. 30 కోట్లు. వరుణ్ కు ఇది భారీ టార్గెట్ అనే చెప్పాలి. ముప్పై కోట్లు రాబట్టాలంటే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి తీరాల్సిందే. మరి ఈ రేంజ్ కంటెంట్ సినిమాలో ఉందా.. లేదా.. అన్నది తెలియాలంటే ఆగస్టు 25 వరకు వెయిట్ చేయాల్సిందే.