తెలుగులో వచ్చిన టాప్ 6 థ్రిల్లర్ సినిమాలు ఇవే…

థ్రిల్లర్  సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అయితే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు. సినిమా మొదలైన దెగ్గర నుండి చివరి వరకు ప్రేక్షకులు ఊహకి అందకుండా దర్శకుడు కథ కథనాన్ని సాధించాలి. అందుకే అన్ని జోనర్స్ లోకి థ్రిల్లర్ సినిమాలు తీయడం అనేది ఎక్కువ కష్టమైన పని. అయితే మన తెలుగులో అలాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకొని సక్సెస్  అయిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. మరి ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించిన టాప్ సిక్స్ ఉత్తమ తెలుగు థ్రిల్లర్ సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఎన్నో సూపర్ సినిమా లో  క్షణక్షణం ‘ అనే సినిమా కూడా ఒకటి. ఈ థ్రిల్లర్ సినిమా లో వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించారు.  ఇక ఈ సినిమా సత్య  అనే అమ్మాయి, చందు అనే చిన్న దొంగ మధ్య సాగే థ్రిల్లర్ స్టోరీ. ఈ సినిమా లో సస్పెన్స్, యాక్షన్, రొమాన్స్ అంశాలు అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మరో హైలెట్.

చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ‘ అనుకోకుండా ఒక రోజు ‘ అనే సినిమా చార్మి కెరియర్ లో మర్చిపోలేని సినిమా.  తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకేక్కిన ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.   ఇదిక ఒక నియో-నోయిర్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కథ మొత్తం ‘సహస్ర ‘ అనే యువతి జీవితంలో అనుకోకుండా ఒకరోజు ఏమి జరిగింది అనే దాని చుట్టూ తిరుగుతుంది. నాన్-లీనియర్ కథనం, ఉత్కంఠభరితమైన కథాంశంతో, చిత్రం చివరి వరకు ప్రేక్షకులను థ్రిల్లర్ కి గురి చేస్తుంది.

వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ ఎవరు ‘. ఈ సినిమా కథ మొత్తం కూడా అనుకోని మలుపులతో తరువాత ఏం జరుగుతుంది అనే ఊసహం ప్రేక్షకులకు కలగజసేలా ఉంటుంది. హత్య విచారణ, వెలుగులోకి వచ్చిన ఊహించని విషయాలు చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా కథ. గట్టి స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనం, అడివి శేష్, రెజీనా కసాండ్రా ల ఆకట్టుకునే నటన ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నేనొక్కడినే’ సినిమా లో మహేష్ బాబు హీరో గా నటించాడు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ భ్రమలతో బాధపడుతున్న గౌతమ్ అనే రాక్ సంగీతకారుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. గౌతమ్ తన గతం వెనుక ఉన్న నిజాన్ని వెతికే ప్రయత్నం, ప్రేక్షకులను మైండ్ బెండింగ్ జర్నీలోకి తీసుకువెళుతుంది.

పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ‘యు టర్న్’ సినిమా ఒక జర్నలిస్ట్  చుట్టూ తిరిగే ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఈ సినిమా లో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఒక యు-టర్న్ వద్ద జరుగుతున్న రహస్య మరణాల ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. ఈ సినిమా ఊహించని మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మినన్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఇదొక అల్టిమేట్ క్రైం థ్రిల్లర్ గా చెప్పొచ్చు.కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు అందరినీ భయపెట్టింది. బాక్సఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మంత్రాలు, తంత్రాల చుట్టూ సాగిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఏంటర్టైన్ చేసింది.