విరూపాక్ష సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన చిత్ర బృందం.. హీరో ఎవరంటే..?

చాలాకాలం తర్వాత సాలిడ్ హీట్ తో మంచి కం బ్యాక్ ఇచ్చారు హీరో సాయి ధరంతేజ్.. విరూపాక్ష సినిమా తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా మిస్టారికల్ థ్రిల్లర్ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది ..ఏకంగా రూ .100 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Virupaksha team is back with a thriller; Deets inside - Telugu News - IndiaGlitz.com

ఈ సినిమా చివరిలో విరూపాక్ష సీక్వెల్ ఉండబోతుందని విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది చిత్ర బృందం. అయితే ఇప్పుడు అనుకున్నట్లుగానే సీక్వెల్ కు సంబంధించి మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ సైతం ఇచ్చారు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్ తో ఈ సినిమాని రూపొందించబోతున్నట్లు వెల్లడించారు. విరూపాక్ష సినిమాకి సంబంధించి సీక్వెల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడుతూ వీలైనంత త్వరగా ఈ సినిమాని సెట్స్ మూవీకి తీసుకోవచ్చె ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

త్వరలోనే సాంకేతిక బృందాన్ని నటీనటుల విషయాలను తెలిపే అవకాశం ఉంది..మరి ఈ చిత్రంలో సాయి ధరంతేజ్ కొనసాగుతారా లేకపోతే మరే హీరోతో తెరకెక్కించబోతున్నారనే విషయం తెలియాల్సి ఉన్నది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కించిన విరుపాక్ష సినిమా లో బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవికృష్ణ, తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. సంయుక్త నటన ఈ సినిమాలో అదిరిపోయిందని చెప్పవచ్చు.