భగవంత్ కేసరి సినిమా రూమర్లపై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు రీమిక్స్ సినిమాలు అంటేనే ప్రేక్షకులు అభిమానులు సైతం చాలా భయపడిపోతున్నారు.. అది ఏ హీరో అయినా సరే నో రీమేక్ అన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా కూడా రీమేక్ అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.. ఇది విన్న బాలయ్య అభిమానులు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు.. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది..వాటి గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం బాలయ్య ఒకవైపు రాజకీయాలలో సినిమాలలో ఫుల్ జోష్ మీద ఉన్నారు.. ఒరిజినల్ కంటెంట్ నమ్ముకొని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న బాలయ్య.. అఖండ ,వీరసింహారెడ్డి సినిమాలతో మాస్ హిట్ ని అందుకున్నారు.. ప్రస్తుతం బాలయ్య మార్కెట్ విలువ రూ .100 కోట్లకు చేరిందని కూడా చెప్పవచ్చు.. బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తూ ఉండగా కూతురి పాత్రల శ్రీ లీల నటిస్తోంది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.. ఇలాంటి సమయంలో 20 ఏళ్ల కింద హరికృష్ణ నటించిన నటించిన స్వామి సినిమాకి ఇది రీమేక్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అక్కడి నుంచి ఈ సినిమా కథని తీసుకొని అనిల్ రావుపూడి తన మార్కుతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలపై నిర్మాతలు క్లారిటీ ఇస్తూ.. ఈ వార్తలన్నీ కూడా అబద్ధాలే అంటూ కొట్టి పారేశారు అభిమానులు ఇలాంటి అవాస్తవాలని అసలు నమ్మవద్దని ఇది స్వామి రీమేక్ కాదని అసలు నిజం ఏంటో అక్టోబర్ 19న థియేటర్లో చూస్తారు అంటూ నిర్మాతలు ఒక ట్విట్ చేశారు.. అది కూడా బాలయ్యను ఎప్పుడు చూడని విధంగా చూస్తారు అంటే ట్విట్ చేశారు..