పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంటే.. జగపతి బాబు, టీనూ ఆనంద్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీ తొలి భాగాన్ని `సాలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్` టైటిల్ తో సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.
సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి ప్రమోషన్స్ ఊపందుకోబోతున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన ముంబైలో సలార్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగబోతోంది. ఇదే సమయంలో ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. తాజాగా నైజాంలో సలార్ థియేట్రికల్ రైట్స్ ను కళ్లు చెదిరే ధరకు విక్రయించారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్ నైజాం హక్కులకు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు రూ. 80 కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధం అయ్యారట. 65 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్, 15 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ కు ఆల్మోస్ట్ డీల్ సెట్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఒక్క ఏరియాలోనే ఈ రేంజ్ బిజినెస్ అంటే మామూలుగా విషయం కాదనే చెప్పాలి. కాగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ నిర్మిస్తున్నారు. అయితే తెలుగులో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.200 కోట్ల దాకా రాబట్టాలని సలార్ మేకర్స్ భావిస్తున్నారట.