శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వంటి యంగ్ స్టార్స్ ఎంత గట్టి పోటీ ఇస్తున్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాత్రం చేతి నిండా సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. ఆల్రెడీ ఈ బ్యూటీ చేతిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ `పుష్ప`, రణబీర్ కపూర్ `యానిమల్`తో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఉంది.
వీటితో పాటు రష్మిక మరో ప్రాజెక్ట్ ను పట్టేసింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో రష్మిక జతకట్టబోతోంది. సార్ వంటి సూపర్ హిట్ అనంతరం ధనుష్ తెలుగులో నేరుగా మరో సినిమా చేయబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ధనుష్ కెరీర్ లో 51వ సినిమా ఇది. ధనిక, పేద మధ్య అంతరాలను చర్చిస్తూ గ్యాంగ్స్టర్ కథాంశంలో ఈ సినిమా కథ సాగుతుంది.
త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్నా ఎంపిక అయింది. అయితే ఈ సినిమాను రష్మిక తక్కువకే ఒప్పుకుందట. ఇంతకు ముందు వరకు రూ. 3.5 నుంచి 4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న రష్మిక.. ధనుష్ చిత్రానికి రూ. 2 కోట్లే పుచ్చుకుంటుందట. టాలీవుడ్ లో యంగ్ బ్యూటీల కాంపిటేసన్ చాలా ఎక్కువగా ఉంది. ధనుష్ మూవీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు రష్మిక నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. కానీ, అంత మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ ఒప్పుకోలేదు. కనీసం మూడు కోట్లు అడిగినా నో చెప్పారట. ఇక చేసేదేమి లేక రూ. 2 కోట్లకే ధనుష్ మూవీకి రష్మిక సైన్ చేసిందని టాక్.