సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ కంటెంట్తో ఎక్కువగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆర్జీవి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పలు పోస్టర్స్, టీజర్ రిలీజై అందరినీ ఆకట్టుకున్నాయి. ఏపీ సీఎం జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను రెండు పార్ట్లుగా రూపొందిస్తున్నాడు. ఆర్జీవి ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది రెండో పార్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ కానున్నాయి.
రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన కుట్రలు.. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగిన విషయాలు.. ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల గురించి మొదటి పార్ట్ లో చూపించబోతున్నాడట. ఇప్పటికే మొదటి టీజర్ రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ టీజర్ రిలీజ్ అయింది. అందులో మాజీ సీఎం రోశయ్య, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా గాంధీ, విజయ్మ పాత్రలను ఆసక్తికరంగా చూపించాడు.
ఈ టీజర్ లో భాగంగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్, చిరంజీవిని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సన్నివేశాలు రచించాడు. టీజర్లో వైసీపీ ఏర్పాటు, జగన్ అరెస్ట్ సమయంలో జరిగిన ఘటనలను చూపించాడు. ఈ టీజర్ లో భాగంగా చిరంజీవి ఇంట్లో జనసేన పార్టీ ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ చర్చల ఎపిసోడ్.. అలాగే సోనియా పాత్ర ద్వారా విభజన అంశాన్ని కూడా వర్మ చూపించాడు. పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు సెటైర్.. పవన్ తనను తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు అంటూ సాగే డైలాగ్ ఇందులో హైలెట్ అయింది.