రాజమౌళి మూవీ..గుంటూరు కారం సినిమా లపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోకుండా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం.

Mahesh Babu opens up about Guntur Kaaram release date - Telugu News - IndiaGlitz.com

నిత్యం ఏదో ఒక విధంగా ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇందులో పూజ హెగ్డే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నారని వార్తలు కూడా వినిపించాయి.. ఆ తర్వాత పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాల పైన ఇప్పటివరకు చిత్ర బృందం ఏ విధంగా స్పందించలేదు.. తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ పైన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ బి -20 ఏళ్ల వేడుకలో మహేష్ బాబు పాల్గొనడం జరిగింది.

 

ఈ వేడుకలలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ముందుగా చెప్పినట్టుగానే సంక్రాంతికి విడుదల కాబోతోందని జనవరి 12వ తేదీలో ఇలాంటి మార్పు లేదని తెలిపారు. దీంతో అభిమానులు సైతం కాస్త ఖుషి అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ వైరల్ గా మారుతున్నాయి ఇందులో శ్రీ లీల జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు గత కొద్దిరోజులుగా జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేయడం జరిగింది.

 

దీంతో ఇదంతా రాజమౌళి సినిమా కోసమే కష్టపడుతున్నారా అని అడగగా అలాంటిదేమీ లేదని చెప్పేశారు మహేష్ బాబు. జిమ్ వర్కౌట్ చాలా రోజుల నుంచి చేస్తున్నాను రాజమౌళి సినిమా ఇంకా ప్రారంభం కాలేదు అందుకు చాలా సమయం ఉందని ఒకవేళ ఆ సినిమా కోసం చేస్తే ముందుగానే చెప్పేవాడిని అని తెలిపారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.