టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఎంతలా సతమతం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్నవారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భయపడుతున్నారు. వరసగా అర డజన్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో పడటంతో.. స్టార్ హీరోలే కాదు కనీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడట్లేదు.
పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భగత్సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన పూజా హెగ్డేను అనూహ్యంగా మేకర్స్ సైడ్ చేసేశారు. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆఫర్లు నిల్ అవ్వడంతో.. ఆమె డబ్బు సంపాదించడానికి షాప్, షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో బిజీ అవుతోంది. ఎవరూ పిలిచినా సరే రిబ్బన్ కట్ చేయడానికి వెళ్లిపోతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కడప టౌన్లో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది.
చీరకట్టులో అందంగా మెరిసిపోతూ మాల్ కు రిబ్బన్ కట్ చేసింది. పూజా హెగ్డే వస్తుందని తెలియడంతో.. ఆమెను చూసేందుకు స్థానికులు, ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా వచ్చారు. దాంతో వారందరినీ పూజా హెగ్డే ఎంతో హుషారుగా పలకరించింది. అలాగే తన సాంగ్స్ కు డ్యాన్స్ కూడా చేసింది. ఇక ఈ ప్రారంభోత్స కార్యక్రమంలో ఉన్నది కొద్ది సేపే అయినా.. పూజా హెగ్డే ఏకంగా రూ. 40 లక్షలు ఛార్జ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇదనే కాదు ఎక్కడ రిబ్బన్ కటింగ్ ఉన్నా కూడా బుట్టబొమ్మ అదే రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందట.