వేణు స్వామితో పూజ ఫలించిందిరోయ్.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన నిధి అగర్వాల్..!!

ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజర్ వేణుస్వామి పేరు సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకోబోతున్నారు అని ముందే ప్రకటించిన వేణు స్వామి.. చెప్పినట్లే చేసారు..చై సామ్ విడాకులు తీసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ తర్వాత కూడా పలువురు స్టార్ సెలబ్రిటీస్ జీవితాల్లో ఆయన చెప్పినట్లే జరగడం గమనార్హం.

ఈ క్రమంలోని పలువురు స్టార్ హీరోయిన్స్ తమ భవిష్యత్తును మార్చుకోవడానికి వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు . ఆలిస్ట్ లోకి వస్తారు అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా హీరోయిన్ నిధి అగర్వాల్.. రష్మిక మందన్నా వేణు స్వామితో కలిసి పూజలు చేసుకున్న తర్వాత ఏ రేంజ్ లో హిట్ ట్రాక్ ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుని.. ఒక్కో సినిమాకి ఐదు కోట్లు డిమాండ్ చేస్తుంది.

కాగా ఆ తర్వాత పూజలు చేయించుకున్న నిధి అగర్వాల్ సైతం హిట్ ట్రాక్ లోకి ఎక్కేసినట్టు తెలుస్తుంది . రీసెంట్గా నిధి అగర్వాల్ స్టార్ డైరెక్టర్ కాల్ చేసి మరి ఆఫర్ ఇచ్చాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాలో మూడో హీరోయిన్గా నిధి అగర్వాల్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు స్వయాన ప్రభాస్ నే నిధి అగర్వాల్ పేరు ని సజెస్ట్ చేయడం గమనార్హం . ఈ పాత్రలో ముందు శ్రీలీలను ఊహించుకున్నారట మేకర్స్ .అయితే ప్రభాస్ ఆమె హైట్ కి నా హైట్ కి మ్యాచ్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసి నిధి అగర్వాల్ ని ఫైనలైజ్ చేసారు. దీంతో వేణు స్వామితో పూజలు ఫలించాయి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . చూడాలి మరి నిధి అగర్వాల్ ఈ సినిమా ద్వారా ఎలా మెప్పిస్తుందో..?