ఓరినీ.. ర‌జ‌నీ `జైల‌ర్‌` స్టోరీని అక్క‌డ నుండి లేపేశారా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రికొద్ది రోజుల్లో `జైల‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్న సంగ‌తి తెలిసిందే. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో త‌మ‌న్నా, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగబాబు, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఆగ‌స్టు 10న ఈ చిత్రం త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది.

తాజాగా జైల‌ర్ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ట్రైల‌ర్ తో సినిమాపై ఒక్క‌సారిగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదిరిపోయేలా ఉన్నాయి. రజినీ మార్క్ డైలాగ్స్ కు విజిల్స్ ప‌డుతున్నాయి. అయితే ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాక కోలీవుడ్ లో ఓ వార్త ఊపందుకుంది. జైల‌ర్ స్టోరీని హాలీవుడ్ నుంచి లేపేశారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

హాలీవుడ్ లో 2021లో విడుద‌లైన నో బడీ(Nobody) సినిమాకు జైల‌ర్ కాపీ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. నో బ‌డీ సినిమాలో ఓ నార్మల్ లైఫ్ పెళ్లాం,బిడ్డలతో నడుపుతూండే ఓ వ్యక్తి అనుకోని పరిస్దితుల్లో రష్యన్ మాఫియాతో తలపడాల్సి వస్తుంది. ఈ హాలీవుడ్ మూవీ ఫుల్ యాక్షన్ తో అదిరిపోతుంది. ట్రైల‌ర్ చూస్తుంటే జైల‌ర్ క‌థ కూడా ఇంచుమించు అలానే ఉంది. దీంతో నో బ‌డీ మూవీకి జైల‌ర్ కాపీ అని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. అయితే నిజ‌మా.. కాదా.. అన్న‌ది తేలాలంటే సినిమా విడుద‌ల అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.