హైపర్ ఆది అక్కడ పట్టుకున్నాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు హైపర్ ఆది. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అలాగే టాప్ కమెడియన్ గా కూడా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకున్నాడు. బుల్లితెరపై జబర్దస్త్ షోలో తన పంచ్ లతో అనతికాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న అతడు.. ఇప్పుడు పలు షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే షోలోని జడ్జిలతో పాటు యాంకర్‌పై కూడా హైపర్ ఆది పంచ్ లు వేస్తూ ఉంటాడు.

అలాగే యాంకర్ దీపికా పిల్లిపై కూడా పలు షోలలో హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. ఈ క్రమంలో తాజాగా ఒక షోలో హైపర్ ఆదిపై యాంకర్ దీపికా పిల్లి సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ ప్రీమియర్ లీగ్ లో హైపర్ ఆది పాల్గొంటున్నాడు. తన కామెడీ, హీరోల వేషాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రొమోను మల్లెమాల ప్రొడక్షన్స్ విడుదల చేసింది. ఇందులో హైపర్ ఆది, యాంకర్ దీపికా పిల్లి కలిసి రాజా సినిమా స్ఫూఫ్ చేశారు. హైపర్ ఆది వెంకటేషన్, దీపికా పిల్లి సౌందర్యలా నటించారు.

రాజా సినిమాలోని క్లైమాక్స్ సీన్ ను ఈ స్కిట్ లో ఇమిటేట్ చేశారు. ఇందులో దీపికా పిల్లి ‘నేను ఢీలోకి రాగానే చేయి చేయి టచ్ చేసి వెంట పులిహోర కలిపిన వ్యక్తి ఒకరు ఉన్నారు’ అంటూ హైపర్ ఆదిపై వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో చెప్పులు, రాళ్లు అంటూ దీపికా పిల్లి మాట్లాడుతుండగా మ్యూజిక్ క్లిప్ వచ్చింది. ఆ తర్వాత ఈ రోజు మీరు విసిరే రాళ్లు, చెప్పులు ఈయన మీదకే వెళ్లాలి అంటూ ఆదిపై పంచ్ లు వేసింది. ఈ ప్రొమో చాలా ఆసక్తికరంగా ఉంది.