ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవ‌రో గెస్ చేయ‌గ‌ల‌రా.. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో!

పైన క‌నిపిస్తున్న ఫోటోలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఆ కుర్రాడెవ‌రో గెస్ చేయ‌గ‌ల‌రా..? టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో. అమ్మాయిల క్ర‌ష్ అత‌ను. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆపై హీరోగా మారాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న ఐదు సినిమాలు చేశాడు. అయితే అందులో ఒక్క‌టి మాత్ర‌మే విజ‌యం సాధించింది.

ఈపాటికే ఆ హీరో ఎవ‌రో అర్థ‌మైపోయి ఉంటుంది. అఖిల్ అక్కినేని. నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అఖిల్‌.. 1995లో సిసింద్రీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత `అఖిల్` మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత హ‌లో, మిస్టర్ మజ్ను సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

అయితే నాలుగో ప్ర‌య‌త్నంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ఫ‌స్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా ఏజెంట్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఇది దారుణ‌మైన డిజాస్ట‌ర్ అయింది. దీంతో అఖిల్ అక్కినేని త‌న త‌దుప‌రి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు. అఖిల్ తదుపరి సినిమాను శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించబోతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవలె అఖిల్‌కు ఓ మాస్‌ కథను చెప్పగా.. ఆయ‌న‌కు బాగా నచ్చి వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)