బాల‌య్య మాస్ బీభ‌త్సం.. రికార్డు ధ‌ర ప‌లికిన `భ‌గ‌వంత్ కేస‌రి` థియేట్రిక‌ల్ రైట్స్‌!

అఖండ‌, వీర సింమా రెడ్డి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. మ‌రో రెండు నెల‌ల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. మోస్ట్ స‌క్సెస్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా..షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్‌ పెద్ది, సాహు గారపాటి క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో బాల‌య్యకు జోడీగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్ కుమార్‌, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు. ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ద‌స‌రా కానుక‌గా ఆక్టోబ‌ర్ 19న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

అయితే రిలీజ్ కు రెండు నెల‌ల ముందే భ‌గ‌వంత్ కేస‌రి థియేట్రిక‌ల్ రైట్స్ రికార్డు ధ‌రకు అమ్ముడు పోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రూ. 75 కోట్లకు వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్‌ ను విక్రయించినట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌య్య కెరీర్ లోనే హ‌య్యోస్ట్ బిజినెస్ ఇది. బాలయ్య గత చిత్రం వీరసింహారెడ్డి రైట్స్ రూ.73 కోట్లకు అమ్ముడవగా.. ఇప్పుడు ఈ రికార్డును భ‌గ‌వంత్ కేస‌రి బ్రేక్ చేసింది. మ‌రి భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల కాబోతున్న ఈ సినిమాతోనే బాల‌య్య హ్యాట్రిక్ హిట్ కొడ‌తాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.