జాతి రత్నాలు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో నవీన్ పోలీశెట్టి.. తాజాగా అనుష్క శెట్టి హీరోయిన్గా, నవీన్ పోలిశెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడం జరిగింది.పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం గమనార్హం.
ఈ సినిమా ట్రైలర్లో భాగంగా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులలో బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉన్న తేడాలను తెలియజేస్తూ ఉంటారు నవీన్ పోలి శెట్టి.. చివరిలో అనుష్కతో చెప్పే ఫన్నీ డైలాగ్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నది. ఇక ఇందులో అనుష్క తన కాళ్ళ మీద తన నిలబడే వ్యక్తిత్వం కల అమ్మాయని ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అనుష్క ఇందులో ఒక ఫేమస్ చెఫ్ గా కనిపించబోతోంది.. నవీన్ పోలిశెట్టి స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నారు. ముఖ్యంగా అనుష్క ఇందులో తల్లి కావాలి అంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పే డైలాగ్ అందరినీ ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తోంది.
డైరెక్టర్ మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది అయితే ఈ సినిమా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషలో కూడా రిలీజ్ కాబోతోంది అదే సమయంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ వైరల్ గా మారుతోంది.