పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా `సలార్`. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే స్పందన లభించింది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తర్వాత బాగా హైలెట్ అయ్యే రోల్ ను ఆయన పోషిస్తున్నాడు. అది పాజిటివ్ పాత్రా..? లేక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రా..? అన్నది మాత్రం తెలియదు.
కానీ, ఆ ముఖ్యమైన పాత్ర కోసం ప్రభాస్ మొదట రానా దగ్గుబాటి, గోపీచంద్ పేర్లను సూచించాడట. ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకోమని ప్రశాంత్ నీల్ కు చెప్పాడట. అయితే అందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకోలేదట. ఆల్రెడీ రానా, గోపీచంద్ తో నువ్వు చేసిన బాహుబలి, వర్షం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి. మళ్లీ వారిద్దరిలో ఒకరిని తీసుకుంటే.. ప్రేక్షకులకు రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఇద్దరూ తెలుగు హీరోలే అయితే మార్కెట్ వర్కౌట్ అవ్వదని చెప్పి ప్రశాంత్ నీల్ డార్లింగ్ మనసును మార్చాడట. ఫైనల్ గా పృథ్వీరాజ్ ను రంగంలోకి దింపారట. అలా అనుకోకుండా `సలార్`లో పృథ్వీరాజ్ పాత్రను రానా, గోపీచంద్ మిస్ చేసుకున్నారు.