విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీకి అన్ని కోట్లా.. మృణాల్ ఇది మ‌రీ టూ మ‌చ్!!

మృణాల్ ఠాకూర్‌.. ఈమె ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే `సీతారామం`కు ముందు, ఆ త‌ర్వాత అనే చెప్పుకోవాలి. గ‌త ఏడాది విడుద‌లైన ఈ సినిమాతో ఆమె జాత‌క‌మే మారిపోయింది. ఓవ‌ర్ నైట్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది. రీసెంట్ గా `ల‌స్ట్ స్టోరీస్ 2`లో అద‌ర‌గొట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ లో భాగం అయింది.

అందుకు `నాని 30` ఒక‌టి. ద‌స‌రా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం న్యాచుర‌ల్ నాని నుంచి రాబోతున్న చిత్ర‌మిది. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌, శృతి హాస‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మృణాల్ ఈ మూవీకి క‌మిట్ అయింది. పర‌శురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లె హెదరాబాద్ లో ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి మృణాల్ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. సీతారామంకు కోటి రూపాయిలు తీసుకున్న మృణాల్‌.. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి ఏకంగా రూ. 5 కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ట‌. నాని సినిమాకు సైతం ఇదే రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటుంద‌ని టాక్ న‌డుస్తోంది. దీంతో నిన్న గాక మొన్న వ‌చ్చిన మృణాల్ ఈ స్థాయిలో డిమాండ్ చేయ‌డం మ‌రీ టూ మ‌చ్ అని చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు.