పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మెగా మల్టీస్టారర్ `బ్రో`. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ గా రూపుదిద్దుకున్న ఫాంటసీ కామెడీ డ్రామా ఇది.
జీ స్టూడియోస్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 28న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై భారీ హైప్ పెంచేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు త్రివిక్రమ్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వినోదయ సితంను తెరకెక్కించిన సముద్రఖనికే రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినా.. త్రివిక్రమ్ హ్యాండ్ మాత్రం గట్టిగానే ఉంది.
స్క్రిన్ ప్లే, మాటలు అందించడమే కాదు.. స్క్రిప్ట్ తో త్రివిక్రమ్ చాలా మార్పులు చేశారు. అందుకే ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో త్రివిక్రమ్ ముందు కొందరు హీరోలు కూడా సరిపోరు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అన్నట్లు త్రివిక్రమ్ మరోవైపు మహేష్ బాబుతో `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.