పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో రాబోతున్న తొలి చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ లో ఈ మూవీని రూపొందించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ చిత్రం జూలై 28న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ మెగా మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపిస్తాడు. ఆయన పాత్ర చిన్నదే అయినా కీలకంగా ఉంటుంది.
అలాగే కథ మొత్తం సాయి ధరమ్ తేజ్ చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మొదట రీమేక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ దేవుడు క్యారక్టర్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. ఇక తేజ్ క్యారెక్ట్ కోసం ముందుగా నితిన్ పేరును సూచించాడు త్రివిక్రమ్. నితిన్, త్రివిక్రమ్ మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. పైగా పవన్ కు నితిన్ విరాభిమాని. అయినా కూడా అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు. నితిన్ కంటే కూడా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని పెట్టుకుంటే తనకి చాలా కంఫర్ట్ ఉంటుందని చెప్పాడట. దాంతో తేజ్ ను కథలోకి తీసుకొచ్చాడు. అలా అనుకోకుండా బ్రో మూవీని నితిన్ మిస్ చేసుకున్నాడు.