మహానటి మూవీతో సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. రీసెంట్ గా దసరా, నాయకుడు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది.
సమంత సూపర్ హిట్ మూవీ బాలీవుడ్ రీమేక్ లో మహానటి హీరోయిన్ గా నటించబోతోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు విజయ్ దళపతి, సమంత జంటగా నటించిన `తేరీ(తెలుగులో పోలీసోడు)`. వరుణ్ ధావన్ హీరోగా ఈ మూవీని బాలీవుడ్ లో పలు మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయబోతున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన అట్లీ బాలీవుడ్ రీమేక్కు మాత్రం ప్రజెంటర్గా వ్యవహరించనున్నాడు.
ఖలీస్ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టగా.. అట్లీ సతీమణి ప్రియా నిర్మాతగా వ్యవహరించబోతోంది. అయితే రీమేక్ లో సమంత రోల్ ను కీర్తి సురేష్ రీప్లేస్ చేయబోతోంది. ఇప్పటికే మేకర్స్ కీర్తి సురేష్ తో సంప్రదింపులు జరపగా.. ఆమె కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందట. వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. మరి బాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్న కీర్తి సురేష్ కు ఎలాంటి వెల్కమ్ దక్కుతుందో చూడాలి.