పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల అయిన వీడియో, ఫస్ట్ లుక్ రికార్డులను క్రియేట్ చేసింది.

పుష్ప 2 సినిమాని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చెయ్యాలని మూవీ టీమ్ అనుకుంటున్నారు. అందుకే పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కి సంబందించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సుకుమార్ పుష్ప సినిమా ని పుష్ప 2 తో ముగించేస్తాడని అంత అనుకున్నారు. కానీ అలా పార్ట్ 2 తో ఆపకుండా దానికి కూడా సీక్వల్ ని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే పుష్ప 2 లో పాత్రల పరిధి ని మరింత పెంచేసారని తెలుస్తుంది.

పుష్ప సిరీస్ లో  రెండు పార్ట్ కి ‘పుష్ప ది రూల్ ‘ అని ఫిక్స్ చెయ్యగా, మూడవ పార్ట్ కి ‘ పుష్ప ది రూల్ బిగిన్స్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తరువాత మూడవ పార్ట్ కి సంబందించిన షూటింగ్ మొదలు పెడతారు అని సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవ్వడం తో పుష్ప 2 సినిమాపై అందరికి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరి అందరి అంచనాలను పుష్ప 2 సినిమా రీచ్ అవుతుందా లేదా చూడాలి.