రష్మిని రాత్రికి రమ్మన్న కమెడియన్.. అసలు విషయం ఏంటంటే…

తెలుగు నాట కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో ప్రసారమయ్యే స్కిట్లకు ప్రేక్షకులంతా పగలబడి నవ్వుతుంటారు. ఇందులో నటించిన నటులకు చాలా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యాంకర్ రష్మి, నటుడు సుధీర్ మధ్య ఉండే బాండింగ్ చాలా పేరొందింది. ఇక వీరిద్దరూ లవ్ లో ఉన్నారని అంతా చెప్పుకుంటారు. వీరిద్దరూ మాత్రం తమ మధ్య అలాంటిది ఏదీ లేదని పేర్కొంటారు. ఇక జబర్దస్త్‌లో సుధీర్ అంతగా కనిపించడం లేదు. అయితే ఆ షోలో అతడి సహచరులు, ఫ్రెండ్స్ ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఇంకా కొనసాగుతున్నారు. అందులో ఆటో రామ్ ప్రసాద్ అన్న ఓ డైలాగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. రష్మిపై అతడు చేసిన వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన వస్తోంది. రామ్ ప్రసాద్ ఇంత మాట అనేశాడేంటి అనే టాక్ ప్రస్తుతం సర్వత్రా నడుస్తోంది.

జబర్దస్త్‌లో డైలాగ్‌లు అందరినీ అలరిస్తుంటాయి. ముఖ్యంగా కామెడీ స్కిట్లలో పలికే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. వీటిపై విమర్శలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అయితే జనాదరణ పొందిన కామెడీ షో కావడంతో దీనికి తెలుగులో తిరుగు లేకుండా ముందుకు సాగుతోంది. ఇక ఇటీవల ఓ జబర్దస్త్ స్కిట్‌లో రామ్ ప్రసాద్ ఓ డైలాగ్ పలికాడు. రష్మిని రాత్రికి రమ్మని పిలిచాడు. వెంటనే ఆ మాటకు జడ్జి స్థానంలో ఉన్న ఇంద్రజ స్పందించింది. ఓయ్ అని హెచ్చరించింది. దీంతో రామ్ ప్రసాద్ వెంటనే కవర్ చేసుకున్నాడు. మా ఊర్లో రాత్రికి జాతర ఉందని, దానికి పిలిచానని పేర్కొన్నాడు. ఇక్కడికి ఈ ఘటన సద్దుమణిగినా ప్రేక్షకులు ఇంకా ఆ డైలాగ్ మర్చిపోలేదు. రష్మికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వారంతా రామ్ ప్రసాద్ పలికిన డైలాగ్‌పై మండిపడుతున్నారు. అయితే ప్రోమోలో అసలు ఏం జరిగిందో స్పష్టత లేదు. అది పూర్తిగా ప్రసారం అయిన తర్వాత దీనిపై స్పందించాలనే ఆలోచనలో రష్మి అభిమానులు ఉన్నారు. గతంలోనూ ఈ షో కోసం ఇలాంటి కొన్ని ప్రోమోలు వదిలారు. ఇది కూడా అదే తరహాలో ఉంటుందని కామెంట్లు వస్తున్నాయి.