అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు ఎన్టీఆర్.. దేవర సినిమా మరో ఆది పురుష్ కానుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ హీరో ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇద్దరికీ ఇద్దరు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాప్ హీరోల పొజిషన్లో ముందుకు దూసుకెళ్తున్నారు . కాగ రీసెంట్ గానే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ కి గురయ్యాలా చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కధా కంటెంట్ బాగున్నప్పటికీ ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూదా ఫైర్ అయ్యారు .

ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కోట్ల వర్షం కురిపించిన సరే ఆ టాక్ అలానే ముందుకు వెళ్తూ ప్రభాస్ కెరియర్ లో మరో డిజాస్టర్ పడేలా చేసింది . అయితే ఇప్పుడు సేమ్ ఎన్టీఆర్ కూడా అదే తప్పు చేస్తున్నాడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది .

కాగా ఈ సినిమాలో కూడా కొరటాల శివ కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ తెరకెక్కించబోతున్నారట . కొరటాల శివాకి గ్రాఫిక్స్ పై పెద్ద అవగాహన లేదు . ఇలాంటి క్రమంలోనే ఏమాత్రం తప్పులు చేసిన దేవర సినిమా మరో ఆది పురుష్ గా మారిపోతుంది అంటూ హెచ్చరిస్తున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు కొరటాల శివ గ్రాఫిక్స్ ను టచ్ చేయకపోవడమే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు . చూడాలి మరి కొరటాల శివ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?