పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సముద్రఖని..

ప్రముఖ నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు . అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్రో సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోయినప్పటికీ ఆ చిత్ర బృందం మాత్రం బాగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. కనీసం సినిమా రిలీజ్ టైం కి అయినా పరిస్థితులు అనుకూలంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 


అయితే ఈ సినిమా దర్శకుడు సముద్రఖని ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్. ఆయనకు గొప్ప విజన్ ఉంది. అలానే పవన్ కళ్యాణ్ ఒక హీరో కావడంతో పాటు రాజకీయాల్లో ప్రజాదారణ ఉన్న ఒక నాయకుడు. ప్రజలకు మంచి చేయాలని ఒక గొప్ప ఆశయంతో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన దగ్గర ఎన్నో మంచి ప్రణాళికలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలను రూపుమాపి భవిష్యత్ తరాల కోసం బంగారు బాట వేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు’ అంటూ  సముద్రఖని చెప్పుకొచ్చాడు.

అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ వినోదయ సిత్తం కథ విని కేవలం పది నిమిషాల్లోనే స్క్రీన్ ప్లే మార్చేశారు. ఇక కేవలం 53 రోజుల్లోనే ఈ సినిమా స్క్రీన్ ప్లే ను అందించారని సముద్రకాన్ని తెలిపాడు. అంతేకాకుండా త్రివిక్రమ్ తో పని చేస్తుంటే నా తండ్రి గుర్తొచ్చారని సముద్రకాన్ని కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ లది డిఫరెంట్ స్టైల్,  వాళ్ళను హ్యాండిల్ చేసే విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. చాలా తక్కువ సమయంలోనే సినిమా పూర్తి చేయగలిగామ్ అంటూ సముద్రఖని ‘బ్రో ‘ప్రమోషన్స్ లో చెప్పారు.