బాల‌య్య `భ‌గ‌వంత్ కేస‌రి` నుంచి క్రేజీ డైలాగ్ లీక్‌.. ఏం ఉంది రా బాబు..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్‌, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తుంటే.. థ‌మ‌న్ త‌న స్వ‌రాలతో మోత మోగించ‌బోతున్నాడు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 80 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న భ‌గ‌వంత్ కేస‌రి విడుద‌ల కానుందని మేక‌ర్స్ ఇప్ప‌టికే అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అఖండ‌, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అనంత‌రం బాల‌య్య నుంచి రాబోతున్న సినిమా ఇది.

ఈ మూవీపై నంద‌మూరి ఫ్యాన్స్ చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీని ఓ క్రేజీ డైలాగ్ నెట్టింట లీక్ అయింది. `ఊర్లో ఉన్న కుక్కలు ఊర్లోనే మొరగాలి.. అడవిలో మొరిగితే సింహం ఊరుకుంటుందా?.. గర్జిస్తుంది.. అడవి బిడ్డ భగవంత్ కేసరి` అనే సాలిడ్ డైలాగ్ ను ఈ సినిమాలో బాల‌య్య ప‌లుకుతాడ‌ట‌. ఆ స‌మ‌యంలో థ‌మ‌న్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవ‌ల్ లో ఉంటుంద‌ట‌. ఇదే క‌నుక నిజ‌మేతే థియేట‌ర్స్ లో ఫ్యాన్స్ కి పూన‌కాలే అని అంటున్నారు.