ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలో మరే హీరోగాకు సాధ్యం కాని ఓ సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనే రెండు కోట్లకు(21.8 మిలియన్స్) పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్ ను 75 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
అయితే ఇటీవల ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ `థ్రెడ్స్` అనే సోషల్ మీడియా యాడ్ వచ్చింది. ఈ యాడ్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు అకౌంట్ ఓపెన్ చేశారు. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్ థ్రెడ్స్ లోకి అలా వచ్చాడో లేదో.. అప్పుడు వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు.
ఇండియాలో మరే సినీ స్టార్ కూడా ఈ ఘనతను సాధించలేదు. థ్రెడ్స్ యాప్ లో వన్ మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా, పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2`తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన వెంటనే త్రివిక్రమ్ తో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీ చేసేందుకు అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు.