యాక్సిడెంట్ కి గురైన కమెడియన్ యాదమ్మ రాజు.. భార్యను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్?

బుల్లితెర కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు యాదమ్మ రాజు. ఇక ఆ తరువాత జబర్దస్త్ షోలో కమెడియన్ గా వెళ్లి తన యాసతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలానే యాదమ్మ రాజు కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయిని  పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. యాదమ్మ రాజు భార్య పేరు స్టెల్లా రాజ్.

యాదమ్మ రాజు అతని భార్య ఇద్దరు కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ చాలా సరదాగా ఉంటారు. అలానే బుల్లితెరపై పలు షోస్ లో కూడా పార్టీస్పేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటీవల ఈ జంట ఒక డాన్స్ ప్రోగ్రాం లో కూడా పార్టిసిపేట్ చేశారు.  అయితే ఇటీవలే యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా యాదమ్మ రాజు భార్య స్టెల్లా తన ఇంస్టాగ్రామ్ పేజ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

స్టెల్లా ఇంస్టాగ్రామ్ లో యాదమ్మ రాజు బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ  ” యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయ్యి, కాలు విరిగింది. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రాజు తొందరగా రికవరీ కావాలి అని కోరుకుంటున్న అభిమానులందరికీ థాంక్స్” అంటూ రాసుకోచ్చింది. స్టెల్లా షేర్ చేసిన ఫోటోస్ , వీడియో చూసి కొంతమంది యాదమ్మ రాజు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూన్నారు. మరి కొంతమందేమో భర్త హాస్పిటల్ లో ఉన్న రీల్స్ చేసి మరి చెప్పడం అవసరమా అని స్టెల్లా ని తిట్టిపోస్తున్నారు.