`స‌లార్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. రూ. 2 వేల కోట్లు దాటేయడం ప‌క్కా అట‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ `స‌లార్‌` విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జగపతి బాబు, టినా ఆనంద్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది. ఆల్రెడీ ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది.

పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుకుంటున్న స‌లార్ పార్ట్ 1 సెప్టెంబ‌ర్ 28న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే విడుద‌ల‌కు చాలా రోజుల ముందే స‌లార్ ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌టకు వ‌చ్చింది. కమెడియన్ సప్తగిరి ఈ సినిమాలో న‌టించాడు. తాజాగా ఆయ‌న స‌లార్ మూవీలో త‌న డ‌బ్బింగ్ ను కంప్లీట్ చేశాడు.

ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో తెలిపిన స‌ప్త‌గిరి.. స‌లార్ మూవీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. స‌లార్‌ మూవీలో నా పాత్రకు ఈ రోజే డబ్బింగ్ కంప్లీట్ చేశాడు. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 2000 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ దాటేయ‌డం ప‌క్కా` అంటూ స‌ప్త‌గిరి ట్వీట్ చేశాడు. అలాగే ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కు థాంక్స్ చెప్తూ ఓ ఫోటోను పంచుకున్నాడు. ఇక ఈయ‌న ట్వీట్ ఫ్యాన్స్ లో మరింత జోష్‌ నింపింది.